contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎమ్మెల్యే రసమయి కి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు ?

కరీంనగర్ జిల్లా : బిజెపి మండల శాఖ పాదయాత్ర మరియు మండల యువకుల పోరాటంతో దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 71 కోట్ల నిధుల జీవో ఉత్తదేనా? మండలంలోని గుండ్లపల్లి – పోత్తూరు డబల్ రోడ్డు పనులు ఆటకెక్కినట్టేనా? గుండ్లపల్లి కొండాపూర్ ప్రజలు దుమ్ముతో అవస్థలు పడాల్సిందేనా.. ఎమ్మెల్యే రసమయి… ఇదేనా మీరు చేసే అభివృద్ధి? మండల ప్రజల ప్రయాణ కష్టాలు తిరేదేన్నడు… అని ప్రశ్నిస్తూ బిజెపి గన్నేరువరం మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పలు గ్రామాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బిజెపి మండల శాఖ డబుల్ రోడ్డు సాధనకై పాదయాత్ర నిర్వహిస్తే ప్రభుత్వం దిగివచ్చి రూపాయలు 71 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిందని, ఆ రోడ్డు పనులు మాత్రం ఏ మాత్రం ప్రారంభం కాలేదని గునుకుల కొండాపూర్ గుండ్లపల్లి గ్రామాల ప్రజలు దుమ్ముతో సతమతమవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రసమయి పనితీరు ఇదేనా అని, మండల ప్రజల ప్రయాణ కష్టాలు తీరేది ఎన్నడని ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను గ్రామస్తులు పరిశీలిస్తూ జరగని అభివృద్ధి గురించి విన్నత నిరసన తెలిపిన బిజెపి మండల శాఖను అభినందిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :