- అడిషనల్ డిస్టిక్ సెన్సెస్ ఆఫీసర్ వెల్ది కిషన్ రావు
కరీంనగర్ జిల్లా: సెన్సెస్ 2027 లో భాగంగా దేశవ్యాప్తంగా మే 11 నుండి నిర్వహించే జనగణన కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని అడిషనల్ డిస్టిక్ సెన్సెస్ ఆఫీసర్ వెల్ది కిషన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన గణన ప్రక్రియలో భాగస్వాములైన ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లు పారదర్శకంగా విధులను నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పలు ప్రభుత్వ పథకాలకు ఈ డాటా ఉపయోగపడుతుందని ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని తెలియజేశారు. ఈసారి జన గణన పూర్తిగా డిజిటల్ మోడ్ లో నిర్వహించబడుతుందని అన్ని వివరాలు మొబైల్ లోనే సేకరింపబడతాయని తెలిపారు. 26 ఏప్రిల్ నుండి సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ప్రారంభమైనదని ఇందులో ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకుంటే వారికి ఒక ఐడి కేటాయింపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం తహశీల్దార్ కే. కనకయ్య, డిస్ట్రిక్ట్ ఇంచార్జీ తిరుపతి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామయ్య,ఎంపిఎస్ఓ సాగర్, గిర్దావర్ రఘు,టీఏ అనిల్, ఫీల్డ్ ట్రైనర్లు ఈ.మల్లేశం, చంద్రశేఖర్ ,రెవెన్యూ సిబ్బంది, ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు.








