- సిద్దప్ప ఇంటి సమీపంలో కాపు కాసి వేట కొడవళ్ళు తో దాడి
- అక్కడికక్కడే మృతి
ఎమ్మిగనూరు: ప్రశాంతంగా ఉన్న కోడుమూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కురువ సిద్దప్ప ( 50) దారుణ హత్య కు గురి అయ్యారు. బుధవారం కోడుమూరు కొత్త బస్టాండ్ సమీపంలో షణ్ముఖ రెడ్డి కాలని లో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనుచరుడు సిద్దప్ప ను గుర్తు తెలియని వారు కాపు కాసి వేట కొడవళ్ళు తో అతి దారుణంగా నరికి చంపారు. గోనెగండ్ల మండలం కున్నురు గ్రామానికి సిద్దప్ప కోడుమూరు లో నివాసం ఉంటున్నాడు.భూ తగాదాలే సిద్దప్ప హత్యకు కారణాలు గా తెలుస్తోంది. గత కొన్ని ఏళ్ల క్రితం కున్నూరు లో ముగ్గురిని చంపిన కేసులో సిద్దప్ప నిందితుడుగా ఉన్నారు.ఇటీవలే రాజీ అయి ఆ కేసు నుండి విముక్తి చెందాడు. సిద్దప్ప కు బార్య తో పాటు 2 కూతుళ్ళు,2 కుమారులు ఉన్నారు. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.