contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కారంపూడి మండల యువజన అధ్యక్షుడిగా చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి

పల్నాడు జిల్లా : కారంపూడి మండల యువజన అధ్యక్షుడుగా చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం నియమితులయ్యారు. మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి,  మండల యువజన అధ్యక్షుడిగా మూడవసారి చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా చిలుకూరు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నా పైన నమ్మకంతో ఈ పదవి అప్పగించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. నన్ను మూడవసారి మండల యువజన అధ్యక్షుడు కావడానికి కారణం కారంపూడి మండల యువత సహకారంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆయన తెలియజేశారు. కాబట్టి నాపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానాని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :