- అక్రమ రిజిస్ట్రేషన్ దా రులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత పేద దళిత కుటుంబానికి న్యాయం చేయాలి.
పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన దాసరి అచ్చయ్య s/o అబ్రహం (ఎస్సీ మాల) తన తాతగారైన అచ్చయ్య కు 1953లో అప్పటి ప్రభుత్వం వారు సర్వేనెంబర్ 189/01 లో 5 ఎకరాల ఊడుగుంట భూమిని కేటాయించగా సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. కాలక్రమేనా కొంతకాలం గడిచిన తర్వాత మొదట తాత ,15 సంవత్సరాల క్రితం తండ్రి మరణించడంతో తన తల్లి గారైన తిరుపతమ్మ తో కలిసి భూమిని సాగు చేస్తూ జీవిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన లాం స్వామి దాస్ (వరఫ్ ఏసులు) తన భూమిపై కన్నేసి కాజేయాలనే ఉద్దేశంతో పలుమార్లు అనేక విధాలుగా వారి కుటుంబం పై దాడులు చేసి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా వారి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొనడం జరిగింది. ఈ విషయమై స్థానిక ఊరు పెద్దలకు చెప్పినా స్వామిదాస్ కు ఉన్న ధనబలం, జనబలమునకు ఏ ఒక్కరూ ఎదురు చెప్పకపోవడంతో కొద్ది రోజుల క్రితం పలనాడు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తమ న్యాయం చేయాలని కోరుతూ మరోసారి పిడుగురాళ్ల ఎమ్మార్వో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ రోజుల తరబడి కాలయాపన చేయకుండా అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి సాగుకే గాని రిజిస్ట్రేషన్ కు వీలుపడని ఆన్ సైడ్ భూమిని ఆక్రమించిన అక్రమ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి, పేద దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు ,పిడిఎం పలనాడు జిల్లా అధ్యక్షులు మస్తాన్వలి, ఎం సి పి ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు కృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణా నాయక్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.