contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రెండు రైళ్లు ఢీ.. 200 మందికి గాయాలు .. ఐదుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. 200 ,మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుంది. ఈ విషయంపై సీఎం మమతా బనెర్జీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

 

https://x.com/i/status/1802560898025787876

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :