contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం లో పోలీసుల కవాతు

  • నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: సిఐ ఇంద్రసేనారెడ్డి

 

కరీంనగర్ జిల్లా:ది రిపోర్టర్ టీవీ: కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలో గుండ్లపల్లి రాజీవ్ రహదారి నుండి గన్నేరువరం వరకు సాయుధబలగాలు కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. ఓటర్లు ఓటు అనే ఆయుధాన్ని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా  వినియోగించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలి.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు చేసుకోవద్దు అని ప్రతి ఒక్కరు తమ గ్రామానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ గ్రామంగా గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేయాలి అని గ్రామాల్లో డబ్బు, మద్యం, వస్తువులు పంపిణీ చేసిన,నిలువచేసిన తమకు గానీ, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలి అని అన్నారు. చట్టాన్ని ఎవరు తన చేతిలోకి తీసుకోవద్దు. ఫిర్యాదు చేసిన వెంటనే తప్పకుండా స్పందిస్తాము, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు.గతంలాగే ఈసారి కూడా కేసులు లేని మండలంగా గన్నేరువరం నిలిచేందుకు ప్రతి వ్యక్తి సహకరించాలి. ఎలాంటి ఇబ్బందులుకు గురి చేసినా ఓటర్లు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చు. ఓటర్లతో గాని, కుల సంఘాలతో గాని ప్రమాణాలు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఓటర్లను ప్రభావితం చేసే పనులు ఎవరు చేయవద్దు.గ్రామాల్లో వివిధ షీట్లలో ఉన్న వారితోపాటు తరచూ గొడవలకు పాల్పడే వారికి, బాండోవర్ అయిన వారికి ఎసిపి కౌన్సిలింగ్ నిర్వహించారు.ప్రతినిత్యం పోలీసులు గ్రామాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారని, తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు.  రాజకీయ పార్టీల నాయకులు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలన్న తప్పకుండా ఎన్నికల అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చందా నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :