మంచిరియల్ జిల్లా : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇదంతా ఆయన మీద జరుగుతున్న కుట్ర. ఆరిజన్ డైరీ డైరెక్టర్లు ఆదినారాయణ, శైలజ మీద తెలంగాణ, ఆంధ్రలో కేసులు నమోదు అయ్యాయి. వారు ఎక్కడికక్కడ రైతుల వద్ద డబ్బులు తీసుకోవడం, మోసం చేయడం సాధారణమే అన్నట్టుగా జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో వారిద్దరిపై పోలీసులు 2012 నుంచి ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేశారు.
బెల్లంపల్లిలో కూడా ఆరిజన్ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేను సంప్రదించినప్పుడు రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన సంస్థ పెట్టేందుకు అంగీకారం తెలిపారు. రైతుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఆరిజన్ సంస్థ ప్రతినిధులు బిచాణా ఎత్తేశారు. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. రైతులు తమకు జరిగిన ఈ మోసం గురించి ఎమ్మెల్యేకు సైతం చెప్పారు. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే MLA ఆరిజన్ ప్రతినిధులతో మాట్లాడారు. ఎవరు పిలిచినా ప్రారంభోత్సవాలకు MLA హోదాలో వెళ్తారు. అలాగే వీళ్ళు పిలిచినా వెళ్ళారు. వీళ్ళు రైతులను మోసం చేసారని తెలిసి MLA స్వయంగా పోలీసులకు పట్టించారు. ఇది దృష్టిలో పెట్టుకొని కొందరు ఈ దొంగలతో చేతులు కలిపి ఒక ముఠాగా ఏర్పడి MLA ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని బారాసా నాయకులు అంటున్నారు.
ఆ వాట్సాప్ చాట్ అంతా ఫేక్. అది MLA ది కాదు.
MLA దుర్గం చిన్నయ్య అంటే గిట్టని ఎవరో ఆకతాయీలు సృష్టించిన దుశ్చర్య ఇది. బెల్లంపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రజలతో మమేకం అవుతూ, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే, ఓర్వలేని వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, MLA ని కావాలని బదనాం చేద్దామనే ఉద్దేశ్యంతోనే ఇదంతా ఫేక్ చాట్ క్రియేట్ చేసారు. ఈ చాట్ MLA ది కాదు. అసలు ఆ నంబరే MLA ది కాదు. MLA మీద అవాస్తవాలు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయి జాగ్రత్త, ఖబడ్ధార్ అని బి అర్ ఎస్ నాయకులు పేర్కొన్నారు.