విజయనగరం జిల్లా : బాడంగి మండలంలో ప్రాధమిక,యూపీ,ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులందరూ తాము చదువు చెప్పటమే కాదు అవసరం ఉన్న కొందమంది పేద, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు సంక్రాంతి కానుకలు బహుకరించారు. నూతన వస్త్రములను మండల విద్యాశాఖాధికారులు లక్ష్మణదొర, రాజేశ్వరి చేతుల మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొల్లి ఈశ్వరరావు, శంబంగి శేఖర్, చొక్కాపు రాము జీవరత్నం, పీటర్ కృష్ణమూర్తి, రామారావు, ఎల్డిఏ కళ్యాణి, సిఆర్పీలు పాల్గొన్నారు.