పల్నాడు జిల్లా కారంపూడి : ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో “ది రిపోర్టర్” టీవీ ముద్రించిన 2023 క్యాలండర్ ని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఆవిష్కరించారు. స్థానిక టిడిపి నాయకులు మాట్లాడుతూ “ది రిపోర్టర్” టీవీ వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని, ప్రజా సమస్యల పై స్పందిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా చేరువవుతుందని సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కటికల బాలకృష్ణ, మండల నాయకులు కాల్వ సామేలు, తండా మస్తాన్ జానీ, బాలు నాయక్, యస్.కె.జానీ భాషా, రాజధాని శ్రీను, కాల్వ పేరయ్య. MRR న్యూస్ నాగేశ్వర రావు , శ్యాంప్రసాద్, రిపోర్టర్ నాగేంద్రబాబు పాల్గొన్నారు.