contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసుల గస్తీ .. ‘పల్లె నిద్ర’తో ప్రజల్లో భరోసా

తిరుపతి జిల్లా, పాకాల : రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సున్నిత, అత్యంత సున్నిత (హైపర్ సెన్సిటివ్) గ్రామాల్లో పోలీసులు అప్రమత్తమై నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని హైపర్ సెన్సిటివ్ గ్రామమైన వల్లివేడులో పాకాల పోలీస్ ఇన్‌స్పెక్టర్ టి. చిన్న గోవిందు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రాత్రి బస చేసి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ తరుణ్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులతో నేరుగా మమేకమై స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ఎన్నికల కోడ్, ప్రవర్తనా నియమావళిపై గ్రామస్తులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

గ్రామాల్లో పోలీసుల రాత్రి బసతో ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీస్ శాఖ అన్ని వేళలా సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా పోలీసులకు సహకరించాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :