ఓటర్ల జాబితా నుండి తొలగించిన పేర్లను పునః పరిశీలించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
ఓటర్ జాబితాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఈఆర్వోలు, ఏ ఈ ఆర్ ఓ లతో తొలగించిన ఓటర్ల వివరాల పున పరిశీలన, అనెక్సర్స్ సమర్పణ, పొలిటికల్ పార్టీల సమావేశాల నిర్వహణ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను మరో మారు పరిశీలించి సరిచూసుకొని తుది జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. చనిపోయిన కేసులో మినహా, షిఫ్టెడ్ క్యాటగిరి, రిపీటెడ్ నేమ్స్ తదితరాలలో నోటీసు ఇచ్చి ఎంక్వయిరీ చేయాలని తెలిపారు.
అనేగ్జర్ 1,2,3,4,5 లను ప్రత్యేకంగా పరిశీలించి ఈనెల 6లోగా ఈఆర్ఓ, ఏఈఆర్ఓ సంతకాలతో నివేదికలను
సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. మార్చిన పోలింగ్ కేంద్రాల వివరాలు అందించాలన్నారు.
ఓటర్ టర్న్ అవుట్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని, స్వీప్ ఆక్టివిటీస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు.
కొత్తగా నియమించిన బిఎల్ఓ లకు శిక్షణ ఇవ్వాలని, బి ఎల్ ఓ యాప్ పై ఓరియంటేషన్ నిర్వహించాలన్నారు.
బి ఎల్ వోలు, బిఎల్ఓ సూపర్వైజర్లతో తక్షణమే సమావేశం నిర్వహించాలని సూచించారు.
ప్రతివారం పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు.
ఆరు కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను ఫిజికల్ గా పరిశీలించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, ఎన్నికల విభాగపు సూపర్డెంట్, తదితరులు పాల్గొన్నారు.