కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకాలు చేస్తున్న కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో మండల కేంద్రం గన్నేరువరంలోని పాఠశాలలో విద్యార్థులే మధ్యాహ్న భోజన వంటకాలు చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ తమకు ప్రతినెల ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచాలని, ప్రతినెల పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడుమేకల రేణుక,కుసుమ కవిత,గంగిపెళ్లి కనకవ్వ,కంటే సత్తవ్వ, బొమ్మేనని పద్మ,పలేపు జనవ్వా,కొంకటి శాంతవ్వ, బత్తుల పుష్పలత,కల్లేపల్లి లచ్చవ్వ,తరవ్వ, బండపల్లి బలవ్వ తదితరులు పాల్గొన్నారు.
