కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ పార్టీ జెండాను కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న సిద్ధాంతం, భావాజాలం తోనే ఈ స్థాయికి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా అవతరించిందని, క్యాడర్ బేస్డ్ పార్టీ బిజెపి అన్నారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు దేశాన్ని ఏలుతుందని , వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చిందని, దేశంలోనే తిరుగు లేని శక్తిగా అవతరించిందన్నారు. బీజేపీ పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదన్నారు. పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆకాంక్షించినట్టు అర్హులైన పేద వారందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే నేషన్ ఫస్ట్.,పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ నినాదం బిజెపి విధానమన్నారు. దేశ ప్రజలాంత బిజెపి పై ఎనలేని విశ్వాసం తో ఉన్నారని, అందుకే వరుసగా మూడుసార్లు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందన్నారు…కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లడానికి కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యలపై నిరంతరం పోరాటం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కరివేద మైపాల్ రెడ్డి,డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, విలాసాగరం రామచంద్రం, మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
◆ గన్నేరువరంలో బీజేపీ జెండా ఆవిష్కరణ..
గన్నేరువరం మండల కేంద్రంలో బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకొని పార్టీ జెండాను బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు బీజేపీ నాయకులు మచ్చ సాయికృష్ణ, యాదవ్ సంఘం మండల అధ్యక్షుడు బీజేపీ నాయకులు సందవేణి ప్రశాంత్ యాదవ్, సీనియర్ నాయకులు మునిగంటి లింగయ్య, మచ్చ బాలరాజు, కుర్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు.








