contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఒడిషా రైలు ప్రమాద … మృతుల సంఖ్య 288… నిర్ధారించిన ప్రభుత్వం

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ నెల 2వ తేదీన జరిగిన ఘోర రైలు ప్రమాదం వందలాది మంది మృతికి కారణమైంది. కొందరు ప్రమాద తీవ్రతతో మరణించగా, మరికొందరు విద్యుత్ షాక్ తో మరణించారు. కాగా, ఈ భయానక రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288గా ఒడిశా ప్రభుత్వం నిర్ధారించింది.

వాస్తవానికి ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 288 అని మొదటి నుంచి మీడియాలో వస్తోంది. అయితే ఒడిశా సర్కారు ఆ కథనాలను ఖండిస్తూ, రైలు ప్రమాదంలో మరణించింది 275 మందేనని ఇటీవల ఓ ప్రకటన చేసింది. అయితే, ఇప్పుడా ప్రకటనకు సవరణ చేసింది.

రైలు ప్రమాదంలో మొత్తం 288 మంది చనిపోయారని ఒడిశా రాష్ట్ర సీఎస్ ప్రదీప్ జెనా తెలిపారు. 205 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని వెల్లడించారు. రోడ్డు మార్గంలో మృతదేహాలను తరలించాలనుకుంటే అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రైలు మార్గంలో తరలించేవారికి అందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. రవాణా చార్జీలను ఒడిశా ప్రభుత్వమే భరిస్తుందని సీఎస్ స్పష్టం చేశారు. 83 గుర్తు తెలియని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :