contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

టీఎస్‌ను టీజీగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించిన సియం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ : నిన్నటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్‌ కోడ్ టీజీ (TG)గా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.

నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమేనని, దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ‘జయహే తెలంగాణ’ను అధికారిక గీతంగా మార్చాలని నిర్ణయించుకున్నామని, తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు లేకుండా సగటు రాష్ట్ర అడవిబిడ్డ రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కాకుండా టీజీగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని, ఉద్యమ సమయంలో వారు అలాగే నినదించారని తెలిపారు. వారి ఆంకాక్షలను నెరవేరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :