నల్గొండ అసెంబ్లీ బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు సినిమాటోగ్రఫీ, ఆర్ అండ్ బి శాఖలు అప్పగించారు. ఇవాళ ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మంత్రిగా తన కార్యకలాపాలు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సినీ రంగం నుంచి దిల్ రాజు తప్ప మరెవరూ ఫోన్ చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. అందుకు తెలంగాణ డబ్బింగ్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ . తెలంగాణాలో మనకి మన సినీ పెద్దలు ఎవరు లేరన్న ! అంతా అణచివేతకు గురయ్యారు. మన దిల్ రాజ్ అన్న ఒక్కడే కొద్దిగా మంచిగున్నడు అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం కవిత జాన్సీ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పెద నాయనా పాలనలో సినిమా, టీవీ రంగాన్ని పూర్తిగా వదిలేసి ఆంధ్రా పెత్తందారుల చేతిలో పెట్టడం వలన తెలంగాణ బిడ్డలు అణచివేతకు గురయ్యారు . తెలంగాణ వచ్చిన తరువాత కూడా అదే బ్రతుకు . ఎన్నో సమస్యలున్నాయి వాటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నానని మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ని కోరారు .