హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. కేసీఆర్కు శుక్రవారం రాత్రి వైద్యులు తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. నిన్న వాకర్ సాయంతో కేసీఆర్ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ కోలుకునేందుకు ఆరు నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నట్టు చెప్పారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)