ఈ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్ గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబలను పరామర్శించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా:కవ్వంపెల్లి సత్యనారాయణ ను ,ఆ గ్రామాములో నిరుపేద బుడిగ జంగల కుటుంబలు కలిసి వారు కొంతం మంది యజమానుల స్థలలో గుడిసెలు వేసుకునే ఎక్కడి నుంచి పాములు ,విష పురుగులు వస్తాయో అనే భయం ఆందోళన జీవితాలను గడుపుతున్నామని ,ఆవేదన వ్యక్తంచేశారు,2018 సం:లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శిలపాలకనికి శంకుస్థాపన చేసి 4సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు గ్రామంలో ఏఒక్క నిరుపేద కుటుంబంనికి ఇల్లు మంజూరి ఇవ్వలేదు అని తమ గోడు విన్నవించారు,కవ్వంపెల్లి సత్యనారాయణ మాట్లాడుతూ6 నెలలో కాంగ్రస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతోంది,తప్పకుండా ప్రతి పేద కుటుంబాలకు ఇంటి స్థలం ఉంటే 5లక్షలు ఇస్తుంది ,సొంత స్థలం లేకుంటే ప్రభుత్వం కొనుగోలు చేసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మిచి ఇస్తుంది అని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో బెజ్జంకి కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,బేగంపేట్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండా అమరేంధర్ రెడ్డి, బెజ్జంకి మాజీ యం ,పి,పి,ఒగ్గు దామోదర్, దొనే వెంకటేశ్వర్రావు ,శీలం నర్సయ్య, రాజు మహేందర్,పిట్టల అరుణ్,గంప రమేష్ మొదలగువారు పాల్గొన్నారు.
