- గ్రామ వార్డు సచివాలయంలో లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.30 లక్షల వరకు మోసం చేసిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన చిత్తూరు క్రైమ్ పోలీసులు
సుమారు 2015వ సం. నుండి గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకులైన నిరుద్యోగులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30 లక్షల వరకు డబ్బులు కాజేసిన ముగ్గురు ముద్దాయిలని ఈరోజు చిత్తూరు క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చిత్తూరు నగరంలో మిట్టూరు నందు నివాసముంటున్న ఎస్.లక్ష్మీ అనే మహిళ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు కాజేసిన వారి పై చిత్తూరు క్రైమ్ పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాధు మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, IPS గారి ప్రత్యేక చొరవతో చిత్తూరు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించి ఈరోజు ముద్దాయిలైన ముగ్గిరిని క్రైమ్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని FCI గోడౌన్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది.
ముద్దాయిల వివరాలు :
1. బత్తుల శ్రీనివాస రావు @ శీను 48 సం. S/O లేట్ వెంకటేశ్వరయ్య, శాంతి నగర్, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
2. బత్తుల జయకృష్ణ ప్రియ, 40 సం. W/O బత్తుల శ్రీనివాస రావు, శాంతి నగర్, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3. ఏ.దశరధ, 49 సం. S/O లేట్ రఘునాథ రెడ్డి, గుడిపాల మండల, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని ఎవరైనా ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ వద్దకు వచ్చిన లేదా అటువంటి వారి గురించి ఏదైనా సమాచారం ఉన్న సంబందింత పోలీస్ స్టేషన్ లో గాని లేదా చిత్తూరు పోలీస్ వాట్స్ యాప్ నెంబర్ 9440900005 కు తెలుపవలెనని చిత్తూరు పోలీసు వారి మనవి.