కరీంనగర్ జిల్లా : గ్రామీణ క్రీడాకారుల కోసం గన్నేరువరం మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం బోర్డు ప్రమాదకరంగా మారింది. బోర్డును ఏర్పాటు చేయడానికి నిర్మించే సమయంలో నాణ్యత లోపించడంతో ఈ క్రీడా ప్రాంగణం బోర్డు కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. కాగా అక్కడే వరి ధాన్యం ఆరబోసుకున్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
