contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుత్తి తాసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం జిల్లా గుత్తి తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో భాగంగా రేపు తహశీల్దార్ కార్యాలయము ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భూముల మ్యుటేషన్, ఆర్.ఓ. ఆర్. (రికార్డు అఫ్ రైట్స్), యఫ్. లైన్. మరియు సబ్ డివిజన్ వంటి సమస్యలు పరిష్కరింప బడతాయి.  కావున సదరు సమస్యలకు సంబంధించి పరిష్కారముకై మండల స్థాయి నందు తహశీల్దార్ వారిని సంప్రదించ వలసినదిగా కోరడమైనది. మండల స్థాయిలో తహసిల్దార్ కార్యాలయంలో పరిష్కారము కానీ సమస్యలు, ఆర్డీవో కార్యాలయమును సంప్రదించవలెను. కావున ప్రజలందరూ మండల స్థాయి నందు జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమమును సద్వినియోగం చేసుకోనవలసినదిగా తాసిల్దార్ పుణ్యవతి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :