contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ప్రజల రక్షణ.. భద్రత కోసమే… పోలీస్ : సీఐ విద్యాసాగర్

  • అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే సమాచారం అందించాలి:సీఐ విద్యాసాగర్

మంచిరియల్ జిల్లా చెన్నూర్ : నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచర్ల గ్రామంలో ఈ రోజు ఏసీపీ నరేందర్ ఆధ్వర్యం లో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సుబ్బారావు 40 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి సరైన పత్రాలు లేని 22 బైక్స్, 02 ఆటోలు  సీజ్ చేశారు.

ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ….నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత కోసమే పోలీసింగ్ ఉందని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని అన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో  చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ వెంకట్, పోలీస్ సిబ్బంది, టి ఎస్ ఎస్ పి , స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :