మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కేపల్లి గ్రామ గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఎస్పీ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సారయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికే పదమూడు మంది అమాయకులపై ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసుల ద్వారా బైండొవర్ చేయడం జరిగిందని, ఇక ముందు ఇలాంటి చర్యలను బీఎస్పీ పార్టీ ఉపేక్షించబోధని, వారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని లేని పక్షంలో గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని సారయ్య హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ చెన్నూరు మండల అధ్యక్షుడు రాజలింగు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..