- రాజుపాలెం బెల్లంకొండ ప్రాంతం నుండి నగరికల్లు మిల్లుకి వెళుతున్న రేషన్ బియ్యం
- న్యూస్ వేస్తె బెదిరింపులు
- పట్టించుకోని అధికారులు
పల్నాడు జిల్లా రాజుపాలెం : రేషన్ మాఫియా వార్డుల్లో సంచరిస్తుంటుంది. రేషన్ షాపులకు వెళ్లి డీలర్లకు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి బియ్యం తనకే పంపించాలంటూ ఒప్పందాలు చేసుకుంటారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పంపించకపోతే ఎదురుదాడుల కూడా దిగిన సందర్భాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు పలు రేషన్ షాపుల వద్ద వ్యాపారులకు చెందిన ముఠాలు బియ్యం పంపిణీ చేసిన అన్ని రోజులు ఉండి లబ్ధిదారులు వేలిముద్ర పెట్టగానే బియ్యం వీళ్లు తీసేసుకుంటారని సమాచారం. మరికొన్నిచోట్ల రేషన్ డీలర్లు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి బెల్లంకొండ రాజుపాలెం మండలాల్లో అత్యధిక షాపులను తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ రేషన్ మాఫియా డాన్ కి నాయకుల అందండలున్నాయని అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని ఆరోపణలు లేకపోలేదు. నిఘా లేకపోవడం వలన అక్రమార్కులకు కలిసొస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదుగా వేచి చూడాలి.